మెదక్ జిల్లా కేంద్రం ఐబీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం మాట్లాడుతూ.. బీసీ లకు రాజ్యాధికారం వచ్చేందుకు బీసీ లందరూ కు కలిసి కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో బీసీ నాయకుల పై అగ్రవర్ణాల వారు చేస్తున్న చర్యలు హేయమని అభివర్ణించారు. ఇలాంటి వారికి బీసీ ఐక్యతగా ఉండి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకాల జయారములు, బీసీ డివిజన్ అధ్యక్షుడు బొద్దుల కృష్ణ, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గుండు ప్రశాంత్ కుమార్, బిట్ల నర్సింహులు, శ్రీపాల్, జిల్లా కార్యదర్శి అల్లం మధు తదితరులు పాల్గొన్నారు.