గన్నేరువరం మండలంలోని పారువెల్ల లక్ష్మీ గణపతి ఆలయ పుష్కర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. రెండవ రోజున స్వామివారికి అభిషేకం నిర్వహించి పంచ కుండలి హోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ జెడ్పిటిసి, బెజ్జంకి ప్యాక్స్ డైరెక్టర్ తన్నీరు శరత్ రావు, మండల ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, నుస్తులాపూర్ ప్యాక్స్ డైరెక్టర్ ఆలువాల కోటి లు స్వామివారిని దర్శించుకుని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి వెంట సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, నాయకులు దుడ్డు మల్లేశం, కాంతాల విక్రం రెడ్డి, బొడ్డు సునీల్, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.