దేశంలోనే అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రజలపై మోపిన ఏసీడి చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్బంగా మాట్లాడుతు నాటి జుట్టు పన్నులా ఏసీడి పేరుతో కేసీఆర్ పన్ను విధిస్తున్నారు అని ఎద్దేవ చేశారు. ప్రజలు ఏసిడి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అని తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రజలకే ఏ సీ డి చార్జీలు వేస్తున్నారని, బకాయిలు చెల్లించలేక పేద ప్రజలపై భారం మోపుతున్నారు అని ఆరోపించారు.