తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, నల్గొండ జిల్లా దామరచర్ల, జగిత్యాల జిల్లా రాఘవపేటలో గరిష్టంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న వడదెబ్బతో గోదావరిఖనికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మధుకుమార్, ఖమ్మం జిల్లాలో ఉపాధి హామీ కూలీ సునీత, జగిత్యాలలో మల్లవ్వ, భద్రాద్రిలో రైతు శ్రీరాములు ప్రాణాలు విడిచారు.