ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రేపు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన భేటీ కానున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ను ఆప్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానిదేనని తీర్పు వెలువరించింది. ఈ తీర్పును అమలు చేయాలని కేజ్రీవాల్తో పాటు ఆప్ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ఇప్పటికే పలువురు నేతలను కలిశారు.