తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టులో అవినీతి జరిగిందని, అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.