సిద్దిపేట జిల్లా అక్బరుపెట భూంపల్లి మండల పరిధిలోని కూడవెళ్లి గ్రామానికి చెందిన ఎనగంటి దుబ్బయ్య(56) అనే రైతు చెక్ డ్యామ్ వద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రామేశ్వరంపల్లి చెక్ డ్యామ్ లో చేపల వేట కోసం కరెంట్ షాక్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతిచెందడం జరిగిందని తెలిపారు.