బడ్జెట్ ను చీల్చి చెండాడుతామంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారని. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నాకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అంటే కేసీఆర్ కు గౌరవం లేదని, ప్రజాస్వామ్యాన్ని చులకనగా చూస్తున్నారని విమర్శించారు.