బాన్సువాడ మండలంలోని తిరుమలపూర్ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం మండల ప్రత్యేక అధికారి రమేష్ రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపకేంద్రంలోని మందులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో, ఎంపీవో , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.