ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ వాసులకు అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:11 PM

హైదరాబాద్ మహానగరంలో ఈనెల 28వ తేదీ ఆదివారం రోజున సింహవాహిని అమ్మవారి బోనాల జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు నుంచే చర్యలు చేపట్టారు. వాహనదారులు ఈ ఆంక్షలను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com