పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా ఎన్నికలు సోమవారం ఆదిలాబాద్ టీఎన్జీవో సంఘ భవనంలో నిర్వహించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులుగా జొన్పల్లి సంజీవ్ రావు, కార్యదర్శిగా బొర్లకుంట దుర్గయ్య , కోశాధికారి ఇజ్జగిరి రాందాస్ తో పాటు తదితరులను ఎన్నుకున్నారు. నూతన ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంద అశోక్, నవీన్ కుమార్ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు.