మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం కేంద్రంలోని, కలకత్తా తండా కు చెందిన, వాంకుడోత్ కటార్ సింగ్ అనే రైతు పొలం, నిన్న కురిసిన వర్షంతో పాటుగా, వీచినా ఈదురుగాడుపుకు తనకున్న రెండు ఎకరాల పొలం మొత్తం నేలమట్టమై పోయింది. తీరా చేతికంది వచ్చిన పంట నేలమట్టం కావడంతో ఆ రైతు దిగ్భ్రాంతికి గురైయ్యాడు.
ఆ కుటుంబంలో కంటనీరు పర్యంతమై విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ అకాల వర్షంతో తీవ్ర నష్టానికి గురి అయిన తనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందే విధంగా ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని వాంకుడోత్ కటార్ సింగ్ అనేరైతు, వ్యవసాయ శాఖ అధికారులు తన వరి పొలానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందే విధముగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.