హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రభుత్వం నేడు గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు అతిథులు ప్రయాణించే దారిలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ డాక్టర్.రవీందర్ తెలిపారు. నార్సింగి - రామ్దేవ్గూడ నుంచి గోల్కొండ కోట వైపు వెళ్లే వాహనాలు లంగర్హౌస్ ఫ్లైవోవర్ కింద నుంచి ఎడమ వైపు తీసుకొని ఫతే దర్వాజా గోల్కొండ పోర్టు వైపు వెళ్లాలి. షేక్పేట్ నాలా నుంచి గోల్కొండ కోట వైపు వెళ్లే వాహనాలను గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి జమాలీ దర్వాజ, గోల్కొండ వైపు మళ్లిస్తారు.