హైదరాబాద్: ప్రయాణికులతో కూడిన మెట్రో రైలు మొదటి ప్రయాణం ఈ తెల్లవారుజామున ప్రారంభమైంది. నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. నగరవాసులు మెట్రో ప్రయాణం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తొలి రోజు లక్ష మంది ప్రయాణికులు మెట్రో జర్నీని ఆస్వాదించనున్నట్లు అంచనా. మియాపూర్-నాగోలు నడుమ 18 రైళ్లు పరుగులు తీస్తూ 24 స్టేషన్లలో ఆగనున్నాయి. ఇరు చివరల గమ్యస్థానాల మధ్య 64 నిమిషాల ప్రయాణ సమయం పడుతుంది. మెట్రో సర్వీసు ప్రధాని చేతుల మీదుగా నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే.