ముంబై: అహ్మదాబాద్, ముంబై మధ్య నడిచే ఎయిర్ఇండియా విమానానికి నిన్న రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. ముంబైలోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయంలో టేక్ఆఫ్ తీసుకునే సమయంలో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముంబై నుంచి అహ్మదాబాద్కు ఆ విమానం బయలు దేరింది. అయితే.. టేక్ఆఫ్ సమయంలో విమానంలోని పోర్ట్ ఇంజిన్ నుంచి మంటలు రావడంతో విమానం టేక్ఆఫ్ కాలేదు. వెంటనే లోపాన్ని గమనించిన పైలెట్ విమానాన్ని నిలిపి వేశాడు. ఇంజన్లో మరమ్మతుల అనంతరం విమానం అహ్మదాబాద్కు బయలుదేరింది.