ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తజనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2018, 08:11 AM

హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర ప్రముఖ శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేయిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com