బీరూట్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్ర వాదులకు పట్టున్న ఆఖరు గ్రామం అల్ షాఫా గ్రామంపై అమెరికా సంకీర్ణదళాలు విరుచుకుపడ్డాయి. ఆదివారం జరిగిన వాయుసేనల దాడుల్లో 25 మంది పౌరులు మరణించారు. సరిహద్దులోని ఐఎస్ నేత అల్బు కమల్ కంచుకోట అల్-షాఫా గ్రామంపై బాంబుల వర్షం కురిసిందని బ్రిటన్కు చెందిన మానవ హక్కుల పరిశీలకుడు రామి అబ్దెల్ రహమాన్ తెలిపారు. ఆదివారం రోజంతా సాగిన బాంబు దాడుల్లో ఏడుగురు చిన్నారులు సహా 25 మంది పౌరులు చనిపోయారు. ఈ గ్రామం సిరియాలో ఐఎస్కు పట్టున్న చిట్టచివరిది అని ఆయన తెలిపారు. యూఫరేట్స్ నదికి ఆవల కుర్దిష్ సేనలతో కలిసి అమెరికా సంకీర్ణదళాలు నదికి పశ్చిమాన రష్యా నేతృత్వంలోని దళాలు దాడులు జరుపుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa