ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షీ టీమ్స్ దేశానికే ఆదర్శం: మంత్రి నాయిని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 03, 2018, 02:20 PM

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్‌ప్లాజాలో పోలీస్ ఎక్స్‌పోను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, సినీ నటి రాశిఖన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. షీ టీమ్స్ వల్లే హైదరాబాద్ ప్రతిష్ట పెరిగింది. బాధితులకు షీ టీమ్స్ అండగా నిలబడుతున్నాయి. మహిళల్లో షీటీమ్స్ పూర్తిస్థాయిలో భరోసా కల్పిసస్తున్నాయి. మహిళల భద్రతకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా షీటీమ్స్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... పోలీస్ ఎక్స్‌పో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉంది. మహిళల భద్రతను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. స్వాతిలక్రా నేతృత్వంలో షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. షీ టీమ్స్ దేశానికే ఆదర్శం. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్. తెలంగాణ గ్రేహౌండ్స్‌ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఫ్రెండ్లీ పోలిసింగ్‌తో ప్రజలకు పోలీసులు దగ్గరయ్యారని తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa