ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాంటి ముస్లిం లేఖలపై పోలీసుల దర్యాప్తు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 11, 2018, 03:23 PM

లండన్: లండన్‌లో యాంటి ముస్లిం పేరిట వెలుగులోకి వస్తున్న లేఖలపై యూకే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 3న ‘పనిష్ ఏ ముస్లిం డే’ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తూ..ముస్లిం వ్యతిరేకవర్గం వారు నగరవ్యాప్తంగా లేఖలను పంచారు. తమకు ముస్లిం వ్యతిరేక లేఖలు వస్తున్నాయని యార్క్‌షైర్, లండన్ , మిడ్‌ల్యాండ్ ప్రాంతాల ప్రజలు ఫిర్యాదు చేశారని పోలీస్ ఉన్నతాధికారి ఏంజేలా విలియమ్స్ తెలిపారు. యూకేలోని ఈశాన్య ఉగ్రవాద ప్రతిఘటిత విభాగం (ఎన్‌ఈసీటీయూ), వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు సంయుక్తంగా లేఖల దుమారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజా భద్రతే తమకు తొలి ప్రాధాన్యత, ముస్లిం మతానికి చెందిన వారు సంయమనంతో ఉండాలని ఏంజేలా విలియమ్స్ కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa