తాను వివాహం చేసుకున్న అమ్మాయి అంతకు ముందే మరో యువకుడిని ప్రేమించిందని తెలుసుకున్న ఓ భర్త ఆమెకు అతడితో ఘనంగా పెళ్లి జరిపించాడు. ఈ ఘటన ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. పంపారాకు చెందిన బసుదేవ్ టప్పూ (24)కు 21 ఏళ్ల ఓ యువతితో మార్చి 4 న వివాహం జరిగింది. ఆ యువతి బంధువులమంటూ శనివారం నాడు ముగ్గురు యువకులు పంపారాలోని టప్పూ నివాసానికి వచ్చారు. వీరిలో సుశీల్ ప్రధాన్ (21) టప్పూ భార్యకు కజిన్గా పరిచయం చేసుకున్నాడు. భోజనం అనంతరం గ్రామాన్ని చూసేందుకు టప్పూతో కలిసి మిగతా ఇద్దరు యువకులు బయటకు వెళ్లగా ‘కజిన్’ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు.
వారు బయటకు వెళ్లిన తర్వాత టప్పూ భార్యతో సుశీల్ ప్రధాన్ సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన స్థానికులు అతడిని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి చితకబాదారు. దీంతో బయటకువచ్చిన ఆ టప్పూ భార్య అతడు తన ప్రేమికుడని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో మరోమార్గం లేక ఈ వివాహానికి ఒప్పుకున్నట ఆమె తెలపడంతో అందరూ షాకయ్యారు. ఈ విషయం తెలిసిన టప్పూ కూడా కాసేపటి వరకు షాక్లో ఉండిపోయాడు. షాక్ నుంచి తేరుకుని చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆమెకు ప్రేమికుడితో మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించాడు. దీని గురించి భార్య తల్లిదండ్రులు, సోదరులుతో మాట్లాడి ఒప్పించాడు. దీంతో భార్య తరఫు బంధువులు, ఆమె ప్రేమికుడి కుటుంబ సభ్యులు శనివారం పంపారాకు చేరుకున్నారు.
వారి సమక్షంలో టప్పూ తన భార్య పెళ్లిని ప్రియుడు సుశీల్ ప్రధాన్తో ఘనంగా జరిపించాడు. ఈ వివాహానికి వందలాది మంది హాజరై దీవించారు. అంతేకాదు గొప్ప మనసుతో వ్యవహరించిన టప్పూపై ప్రశంసలు కురిపించారు. వివాహం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన భార్యకు ప్రియుడితో వివాహం జరిపించకపోయింటే మూడు జీవితాలు నాశనం అయిపోయేవని వ్యాఖ్యానించాడు. ఈ ఒక్క పనితో ఇప్పుడు ముగ్గురం సంతోషంగా ఉన్నామని తెలిపాడు. టప్పూ తల్లి కూడా తన కుమారుడి నిర్ణయాన్ని స్వాగతించి మద్దతుగా నిలిచింది. ఆయన తమకు చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని మాజీ భార్య పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa