ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ భార్యకే లైంగిక వేధింపులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 01:56 PM

కొచ్చిః ఆమె కేరళ కాంగ్రెస్ చీఫ్ కేఎం మణి కోడలు. సాక్షాత్తూ ఎంపీ జోస్ మణి భార్య. ఆమెకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. తనపై తాను రాసుకున్న ది అదర్ సైట్ ఆఫ్ దిస్ లైఫ్- స్నిప్పెట్స్ ఆఫ్ మై లైఫ్ యాస్ ఎ పొలిటీషియన్స్ వైఫ్ అనే బుక్‌ను రిలీజ చేశారు నిషా జోస్. ఈ సందర్భంగా తనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన వివరాలను ఆమె వెల్లడించారు. పైగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించింది మరో రాజకీయ నాయకుడే కావడం గమనార్హం. తాను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ నేత తనతో అసభ్యంగా ప్రవర్తించారని నిషా చెప్పారు. 2012లో ఈ ఘటన జరిగింది. చాలాసార్లు తన కాలిని ఆయన తాకారని నిషా చెప్పారు. ఇదే విషయాన్ని అక్కడే ఉన్న ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కు చెప్పినా.. ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. 


ఆయనపై చర్య తీసుకుంటే తన ఉద్యోగానికే ముప్పని ఆయన చెప్పినట్లు నిషా తెలిపారు. దీనిపై పై అధికారులకు కూడా ఆమె లేఖ రాశారు. అయితే ఈ వేధింపులకు పాల్పడిన ఆ వ్యక్తి పేరు బయట పెట్టాలని కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ తనయుడు షోన్ జార్జ్ డిమాండ్ చేశారు. నిషా అతని పేరు చెప్పకపోవడం వల్ల కొందరు తనను అనుమానిస్తున్నట్లు ఆయన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన బుక్‌ను అమ్ముకోవడానికే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని షోన్ జార్జ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైల్లో తాను ఓ రాజకీయ నేత తనయుడిగా పరిచయం చేసుకున్నాడని, తర్వాత తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నిషా చెప్పారు. దీంతో తాను అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చానని, తర్వాత తన భర్తకు ఈ విషయం చెప్పినట్లు నిషా తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa