హైదరాబాద్ : రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన విజయవంతమైందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహముద్ అలీ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అసైన్డ్ భూములపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 20 నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామని చెప్పారు. భద్రతా ప్రమాణాలతో పాస్బుక్స్ను తయారు చేస్తున్నామని చెప్పారు. భూరికార్డుల సమగ్ర సర్వేను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పేర్కొన్నారు. జగిత్యాలలో వంద శాతం సర్వే పూర్తయిందని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో భూరికార్డుల ప్రక్షాళన దాదాపుగా పూర్తి అయింది. కొన్ని చోట్ల సమస్యలున్నాయి. త్వరలోనే ఆ ప్రాంతాల్లో కూడా సర్వే పూర్తి చేస్తామని ప్రకటించారు. అసైన్డ్ భూములను పేదలు పేదలకే అమ్మితే పట్టాలిస్తామని స్పష్టం చేశారు. వక్ఫ్, ఎండోమెంట్ భూములను కబ్జాల నుంచి కాపాడుతామని పేర్కొన్నారు. వక్ఫ బోర్డు భూముల పట్టా బోర్డు పేరిట ఉంటుందన్నారు. సాదా బైనామా దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ధరణి వెబ్సైట్లో భూములకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa