ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిస్కంల భారం ప్రభుత్వమే తీసుకుంది: జగదీశ్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 23, 2018, 12:33 PM

హైదరాబాద్: డిస్కంల భారం ప్రభుత్వమే తీసుకున్నట్లు రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ శాఖపై బారం, రాష్ట్ర ప్రబుత్వం అందిస్తున్న సబ్సిడీలు, వ్యయం తదితరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఉదయస్కీమ్ లో చేరడం వల్ల రూ. 8923 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. 1610 కోట్ల డిస్కంల మీద ఇప్పటికీ బారం ఉందని అయినా మన డిస్కంలో ఇప్పటికీ అరోగ్యకరంగానే ఉన్నాయన్నారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం ప్రజలకు అందించే రూ. 4,777 కోట్ల సబ్సిడీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 2015-16లో విద్యుత్ చార్జీలను కేవలం 5% రివిజన్ చేయడం జరిగిందని చెప్పారు. ఎక్కడ కూడ గృహావసరాలకు వాడుతున్న విద్యుత్ చార్జీల రివిజన్ జరుగలేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ సబ్సిడీలను అందించలేమని మంత్రి వెల్లడించారు. సబ్సిడీలు ఇచ్చుకుంటూ పోతే కట్టే వారెవరూ ఉండరని.. కట్టేవారు ఉన్నప్పుడే రాయితీలు, సబ్సిడీలకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో సౌర విద్యుత్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిదిలో లేదని తెలిపిన మంత్రి ప్రతిపాదనలు అందజేస్తే అధికారులతో సంప్రదించి పరిశీలన చేస్తామని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa