ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేరాలు చేసిన వారికి కౌన్సెలింగ్: వీకే సింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 23, 2018, 02:24 PM

హైదరాబాద్: నేరాలు చేసి జైలుకు వచ్చిన వారికి కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. రాష్ట్రంలోని జైళ్ల శాఖలో నూతన సంస్కరణలు చేపడుతున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఖైదీల్లో మార్పు తెస్తున్నామని వీకే సింగ్ పేర్కొన్నారు. జైళ్లలో సంస్కరణలతో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. పెట్రోల్ బంకుల్లో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చి జీవనోపాధి కల్పిస్తామన్నారు. 2020 వరకు రూ.10 వేల కోట్లు స్వతహాగా సమకూర్చుకుంటామని చెప్పారు. 2018-19లో 50 శాతం నేరాల సంఖ్యను తగ్గించడమే తమ లక్ష్యమని వీకే సింగ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 100 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 1000 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa