చెనై్న : జయలలిత మృతి తరువాత తమిళనాడులోని అధికార అన్నా డీఎంకేలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజక వర్గానికి వచ్చే నెల 12న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్నా డీఎంకే నుంచి దినకరన్ను అభ్యర్థిగా ప్రకటించిన అంశంపై పన్నీర్ సెల్వం విమర్శలు చేశారు. ఆ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపే అర్హత శశికళకు లేదని అన్నారు. ఆయనను ఎన్నికల కమిషన్ అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నా డీఎంకే పార్టీకి, దినకరన్కు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa