అవెన్సిస్ 2కే 17 పేరుతో అవంతి కళాశాల ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న యువజనోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హీరో రామ్చరణ్ అవంతి విద్యాసంస్థల చైర్మన, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబంతో ఉన్న అనుబంధం వల్లే ఇక్కడకు వచ్చానని రామ్చరణ్ అన్నారు. మెగా ఫ్యామిలీతో ఎన్నో ఏళ్ల నుంచి అవంతి విద్యాసంస్థల అనుబంధం కలిగి ఉన్నారన్నారు. కళాశాలను ఏర్పాటు చేసి సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించడమంటే సాధారణ విషయం కాదన్నారు. వెన్నునొప్పితో బాధపడుతున్నా... మీ సంకల్పం వల్లే ఇక్కడకు వచ్చానన్నారు. ఏ ఫంక్షనకు వెళ్లకపోయినా విద్యార్థుల ఫంక్షనకు తప్పనసరిగా వెళతానన్నారు. ఎవరూ చూపించనంత ప్రేమ, ఆప్యాయతలను యువత తమ కుటుంబంపై చూపిస్తోందన్నారు.‘కాటమరాయుడు’ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, సినిమా అంతకంటే అద్భుతంగా ఉంటుందన్నారు. గత ఏడాది ధృవ, ఈ ఏడాది ఆరంభంలో ఖైదీ 150, ఉగాదికి ‘కాటమరాయుడు’తో తమ కుటుంబానికి విజయానందాలను అభిమానులు అందిస్తున్నారన్నారు.