బంజారాహిల్స్ : ఓ వ్యాపా రి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఖరీదైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం.4లో నివాసం ఉంటున్న సాయిరామ్ మోచర్ల అనే వ్యాపారవేత్త నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్బీసీసీ ) సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పనిచేయడంతో పాటు పలు నిర్మాణసంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇంట్లోని బెడ్రూంలో లాకర్లో ఉంచిన తల్లి, భార్యకు చెంది న ఖరీదైన ఆభరణాలు మూడు రోజులుగా కనిపించడంలేదు. అమెరికన్ డైమండ్ నెక్లెస్, డైమం డ్ అర్డిగా, పెరల్ గ్రీన్ రెడ్హెడ్స్ లాంగ్ చైన్, పెర ల్స్ గోల్డ్ నెక్లెస్, పెరల్స్ చైన్ విత్ లక్ష్మీ పెండెండ్తో పాటు వజ్రాలు పొదిగిన బంగారు గాజులు, ఉంగరాలు, రూబీలతో తయారు చేసిన గాజులు దాచి ఉంచిన బాక్స్ మాయమైంది. ఇంట్లోనే ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటామని భావించి అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడం తో బుధవారం బాధితుడు సాయిరామ్ మోచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 19రకాల ఖరీదైన ఆభరణాలు మాయమయ్యాయని, వీటి విలువ సుమారు రూ. 1కోటిదాకా ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.