హైదరాబాద్: కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఫ్రెసీనియస్ బ్రాండ్ సెలైన్ బాటిళ్లలో ఫంగస్ కలకలం రేగింది. సెలైన్ బాటిళ్లు వాడడంతో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించారు. ఫ్రెసీనియస్ బ్రాండ్ సెలైన్ బాటిళ్లు వాడవద్దని డీఎంఈ ఆదేశించారు.