ఖైదీ నంబర్ 150తో చిరంజీవి సినిమాల్లోకి పునరాగమనం చేశారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లను సాధించింది. తాజాగా ఆయన 151వ చిత్రానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత అనుష్కకు ఈ అవకాశం దక్కినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆమె స్థానంలో చివరకు శృతిహాసన్ను కథానాయికగా తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మెగా హీరోలు రామ్చరణ్తో ఎవడు, పవన్కల్యాణ్తో గబ్బర్సింగ్, అల్లు అర్జున్తో రేసుగుర్రం చిత్రాల్లో శృతిహాసన్ కథానాయికగా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa