రంగారెడ్డి : పూడూరు మండలం, చేవేళ్ల మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు రహదారిపై ధర్నాకు దిగారు. తమ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు సరిపోవడం లేదని.. మరిన్ని పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై విద్యార్థులు బైఠాయించడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వికారాబాద్, పరిగి డిపోలకు చెందిన డీఎంలు వచ్చే వరకు ఆందోళన చేస్తామని.. అప్పటి వరకు ఇక్కడ్నుంచి కదలబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థుల ధర్నాతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.