హైదరాబాద్ : గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 45 కిలోల గంజాయిని శుక్రవారం ఉదయం స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. గోదావరి ఎక్స్ప్రెస్లో ఏలూరు నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా గంజాయిని గుర్తించారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రైల్వే కోర్టులో హాజరుపరిచారు.