ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్‌ మెరీనా భవంతిలో అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2017, 09:40 AM

దుబాయ్‌: ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మెరీనా భవంతిలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌లోని ప్రసిద్ధ పర్యాటక స్థలాల్లో ఒకటైన ఈ 79 అంతస్తుల టార్చ్‌ టవర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే సగానికిపైగా భవనం మంటల్లో కాలిపోయింది. అయితే ఎవ్వరికీ గాయాలు కాలేదని దుబాయ్‌ మీడియా ప్రతినిధులు వెల్లడించారు.


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికిచేరుకుని మంటలు అదుపుచేశారు. స్థానికులు ఈ దృశ్యాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. 2015లో ఈ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com