దుబాయ్: ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మెరీనా భవంతిలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్లోని ప్రసిద్ధ పర్యాటక స్థలాల్లో ఒకటైన ఈ 79 అంతస్తుల టార్చ్ టవర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే సగానికిపైగా భవనం మంటల్లో కాలిపోయింది. అయితే ఎవ్వరికీ గాయాలు కాలేదని దుబాయ్ మీడియా ప్రతినిధులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికిచేరుకుని మంటలు అదుపుచేశారు. స్థానికులు ఈ దృశ్యాలను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. 2015లో ఈ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.