భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని కొత్తగూడెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సింగరేణి స్టేడియం గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్న పినపాక తహసీల్దార్ ప్రసాదరావు(57) కుప్పకూలిపోయారు. స్థానికులు హుటాహుటిన సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రసాదరావు మరో రెండు నెలల్లో రిటైర్డ్ కానున్నారు.