హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఇవాళ రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ తోబుట్టువులు ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వదించారు. స్వీట్లు తినిపించి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పలువురు టీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు సైతం కేసీఆర్కు రాఖీలు కట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు వారికి కానుకలు సమర్పించారు. ఎంపీ కవిత తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టి హెల్మెట్ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత తాను ప్రారంభించిన సిస్టర్స్ ఫర్ చేంజ్ లో భాగంగా అన్న కేటీఆర్ కు రాఖీ కట్టి హెల్మెట్ ను బహుకరించారు. తర్వాత మంత్రి కేటీఆర్ చెల్లెలు కవిత కు చేనేత చీరను బహుకరించారు.