ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మన పేసర్లు అదరగొడుతున్నారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 05:21 PM

భారత బౌలింగ్ విభాగం అంటే స్పిన్నర్లే గుర్తొకొస్తారు. ఉప ఖండం పిచ్‌లపై స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లు. మన పేస్ బౌలింగ్ అటాక్ బలహీనం. కానీ ఇది ఒకప్పటి మాట. మన పేసర్లు కూడా ప్రపంచ స్థాయిని అందుకున్నారు. వేగంగా బంతులు విసురుతూ ప్రత్యర్థిని భయపెడుతున్నారు. ఉమేశ్ యాదవ్ స్పీడ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారగా.. బుమ్రా, భువీ యార్కర్లతో ఆకట్టుకుంటున్నారు. భారత్ వరుసబెట్టి టెస్టు సిరీస్‌లను గెలుస్తుండగా.. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు తోడుగా పేసర్లు కూడా వికెట్లు పడగొడుతున్నారు.భారత్‌కు ప్రపంచ స్థాయి బౌలర్లు లభించారని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఉమేశ్ యాదవ్ లాంటి బౌలర్ల ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. మనం ఇప్పుడు ఫాస్ట్ బౌలర్లపై ఆధారపడుతున్నాం. ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్లు లేని స్థితి ఉండగా.. ఇప్పుడు బోలెడంత మంది ఫాస్ట్ బౌలర్లు మనకు ఉన్నారని కపిల్ తెలిపారు.


ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రతిభ కనబరుస్తోన్న హార్ధిక్ పాండ్యపై కపిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడికి రాణించే సత్తా ఉంది. తను ఇలాగే నిలకడైన ప్రదర్శనను కనబర్చాల్సి ఉంటుందని భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాండ్య నిలకడగా రాణిస్తే.. చక్కటి ఆల్‌రౌండర్ లభించినట్లేనని కపిల్ అన్నారు. గత 20 ఏళ్లుగా చూస్తే ప్రస్తుత భారత జట్టే అత్యుత్తమమైందని టీమిండియా కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించడం పట్ల స్పందించడానికి కపిల్ నిరాకరించారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని సమాధానం దాటవేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa