ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేరెళ్ల ఘటన కేసీఆర్ కు మాయని మచ్చ అవుతుంది:మోత్కుపల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2017, 06:13 PM

నేరెళ్ల ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే అది సీఎం కేసీఆర్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. కులం పేరుతో దూషిస్తూ దళితులను కొట్టారని, మత్తు మందు ఇచ్చి వారిని చితకబాదారని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదని అన్నారు. ఈ ఘటనలో ఎస్ఐపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమకు ప్రాణహాని ఉందంటూ నేరేళ్ల బాధితులు మీడియా ముందు ఇటీవల వాపోయారని, వారి ఆక్రందనలు మంత్రి కేటీఆర్ కు, స్థానిక ఎమ్మెల్యేకు పట్టవా? అని ప్రశ్నించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa