పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ నివాసం ముందు ఆర్జేడీ, శరద్ యాదవ్ కార్యకర్తల నిరసన ప్రదర్శన చేపట్టారు. జేడీయూ జాతీయ కార్యవర్గం సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఏన్డీఏలో నితీశ్ను ఆహ్వానించిన తర్వాత జేడీయూలో చీలకలు మొదలయ్యాయి. శరద్ యాదవ్ను పార్టీ నుంచి తొలిగిస్తూ నితీశ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షాలతో కలిసి శరద్ యాదవ్ శుక్రవారం భారీ సభను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జేడీయూలో తన పట్ల వ్యతిరేకంగా ఉన్నవారితోనూ శరద్ మంతనాలు జరిపారు. జేడీయూ సమావేశం పట్ల ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. నితీశ్ నిర్వహిస్తున్నది బీజేపీ సమావేశం అని లాలూ ఆరోపించారు.