ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక పై భారత్ టార్గెట్ 237

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 24, 2017, 06:28 PM

పల్లెకెలె: ల్లెకెలె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన 236 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 237 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తోలుత టాస్ గెలిచి శ్రీలంకను భ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్లు శుభారంభం అందించారు. 40 పరుగుల వద్ద డిక్‌వెల్లా (31) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది శ్రీలంక. అనంతరం గుణతిలక 19, మెండిస్ 19, తరంగ 9, మాథ్యూస్ 20 నెమ్మదిగా ఆడారు. 28.3 ఓవర్లలో 121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన లంకను సిరివర్దన (58), కుపుగెదెర (40) ఆదుకున్నారు. దీంతో 50 ఓవర్లలో 236 పరుగులు చేయగలిగింది ఆతిథ్య జట్టు. బూమ్రా తన పేస్‌తో ఆకట్టుకున్నాడు. 4 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. చాహల్ 2 వికెట్లు తీసుకొగా, చాహల్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com