ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారు లక్ష్మణ్‌ మహా అధ్యయనశీలి చింతల రాంచంద్రారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 11:50 PM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: బీజేపీ మాజీ అధ్యక్షుడు దివంగత నేత బంగారు లక్ష్మణ్‌ మహా అధ్యయనశీలి అని, ఆయనతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆ పార్టీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బంగారు లక్ష్మణ్‌ 3వ వర్దంతి సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ  కార్మికుల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఆయన స్పూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాంచంద్రారెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు టి.రాజేశ్వర్‌రావు, ధర్మారావు, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌ రెడ్డి, ఎస్‌.కుమార్‌ వేముల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa