ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఎస్‌ఎన్‌ఎల్‌ దీపావళి ఆఫర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2017, 01:30 PM

భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కంప్యూటర్లు హ్యాకర్లు,వైరస్‌ల బారిన పడకుండా కేవలం రూపాయికే సేవలు అందిస్తోంది.


‘ఎక్స్‌జెన్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌’ పేరిట రూపాయికే ఈ-మెయిల్‌ సర్వీసులను అందిస్తోంది. జైపూర్‌కు చెందిన డేటా ఇన్ఫోసిస్‌ అనే కార్పొరేట్‌ ఈ-మెయిల్‌ సర్వీస్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఆఫర్‌ను కేవలం తమ వినియోదారులకే అందించనుంది. ఈ విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిక ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ‘వైరస్‌కు, హ్యాకింగ్‌కు, స్పామింగ్‌కు ఎక్స్‌జెన్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఫీచర్స్‌తోచెక్‌ పెట్టండి.’ అని ట్వీట్‌లో పేర్కొంది.


ఎక్స్‌జెన్‌ ప్లస్‌ సేవలు ఇలా.. 


బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు ఏడాదికి రూ.365 చెల్లిస్తే ఈ ఎక్స్‌జెన్‌ సేవలను ఈ-మెయిల్స్‌తో లింక్‌ చేస్తారు. రూ.365కి 1 జీబీ స్టోరేజి, రూ.999కి 10 గీగా బైట్ల స్టోరేజీ ఉంటుంది. ఏడాది ఒకసారి మాత్రమే చెల్లింపులు ఉంటాయని డేటా ఇన్ఫోసిస్‌ సీఈవో అజయ్‌ తెలిపారు. ఈ-మెయిల్స్‌ విషయంలో కేవలం వ్యక్తిగత గోప్యతకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.


బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ-మెయిల్‌ సర్వీస్‌కి మొబైల్‌ యాప్‌ కూడా ఉంది. కార్పొరేట్‌, పర్సనల్‌ సబ్‌స్క్రైబర్లు ఈ యాప్‌ ద్వారా సేవల్ని వినియోగించుకోవచ్చు. ఈ కొత్త ఈ-మెయిల్‌ ప్లాట్‌ఫాం ద్వారా గ్రూప్‌ మెయిల్స్‌, షెడ్యూలింగ్‌ మెయిల్స్‌ పంపుకునే సౌలభ్యం కూడా ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com