ముంబై : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పల్లేడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు అక్కడ కూంబింగ్ ముమ్మరం చేశారు.