సూరత్ : గుజరాత్ ఎన్నికల సందర్భంగా సూరత్లో మతం పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓట్లు కోరుతున్నట్లు ఉన్న పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లకు తమకూ ఎలాంటి సంబంధం లేదని, మతం పేరిట తాము ఓట్లను కోరబోమని సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ అన్నారు. కాగా, ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళతామని బిజెపి పేర్కొంది.