హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం గురుకుల విద్యాలయాలను ప్రారంభించనుంది. టీఆర్ఈఐఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2017-18 విద్యాసంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ ప్రకటన జారీ అయింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. తదితర వివరాల కోసం WWW.TGCET.CGG.GOV.IN వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.