ఈ నెల 15 నుంచి హైదరాబాద్ నగరంలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చే అతిథులను గుండెల్లో పెట్టుకు చూసుకుంటామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ఉద్యమ రూపం అన్నారు. ఏనాడూ తెలంగాణ పేరెత్తని ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలసిన అవసరం లేదన్నారు. ఘనంగా తెలుగు మహాసభలను నిర్వహించుకోబోతున్నామని, భాష ఔన్నత్యం, ఖ్యాతిని పెంచేలా తెలుగు మహాసభలు ఉంటాయన్నారు. భాషా ప్రేమికులకు కావాల్సినంత సంతోషం , అల్పులకు కావాల్సినంత దు:ఖం దొరుకుతుందన్నారు.