లక్నో : లక్నోలో కర్నిసేన సభ్యులు గాంధీగిరి విధానంలో పద్మావత్ చిత్రం పట్ల తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిత్రం చూడటానికి వస్తున్న ప్రజలకు గులాబీ పూలు ఇచ్చి చిత్రాన్ని చూడవద్దని కోరుతున్నారు. చిత్రం చూడటానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి టికెట్ సొమ్ము తాము తిరిగి ఇచ్చేస్తామని వారు చెబుతున్నారు.