మా ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. సాధారణ ఎన్నికల మాదిరిగానే మా ఎన్నికలు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో రాజేంద్ర ప్రసాద్, జయసుధలు మా పీఠం దక్కించుకునేందుకు పోఠీ పడగా విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ ఎన్నికలని రసవత్తరంగా మార్చారు. ఇక ఇప్పుడు శివాజీ రాజా, నరేష్లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ, ఆరోపణలు గుప్పిస్తూ మా పీఠం దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.
మా ఎన్నికలకి ఎలక్షన్ కమిటీ అంతా సిద్దం చేసింది. నరేష్, శివాజీ రాజా ప్యానెల్స్లో ఎవరు గెలుస్తారనేది మరి కొద్ది గంటలలో తెలియనుంది. సుమారు 745 మంది మూవీ ఆర్టిస్టులు ఎన్నికలలో పాల్గొననున్నారు. నరేష్ ప్యానెల్కి నాగ బాబు, మహేష్ బాబు, జీవిత, రాజశేఖర్ వంటి స్టార్స్ సపోర్ట్ ఉండగా, శివాజీ రాజాకి మాత్రం మద్దతు కరువైంది. వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం నటి హేమ్ ఇండిపెండెంట్గా పోటి చేస్తుంది. శివాజీ రాజా తరపున మ్యా పానెల్ బరిలో 25 మంది సభ్యులు ఉండగా, నరేష్ ప్యానెల్ బరిలో 23 మంది సభ్యులు ఉన్నారు. సాయంత్రం 5 గంటలకి ఓట్ల లెక్కింపు మొదలు కానుండగా, రాత్రి వరకు ఫలితాలు వెలువడనున్నాయి.