ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామ్యానులకు ఉపయోగపడని టెక్నాలజీ వృథా: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 01:00 PM

హైదరాబాద్: సామాన్యులకు ఉపయోగపడని టెక్నాలజీ వృథా అని సీఎం కేసీఆర్ చెప్తుంటారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కీ మేకర్స్ యూత్ సమ్మిట్-2019ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎక్కువ మంది యువత ఉన్న దేశం మనది. యువత శక్తిని ఉపయోగించుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదని తెలిపారు. నిత్యం మనం ఎదుర్కొనే సమస్యల నుంచి నూతన ఆవిష్కరణలు వస్తాయన్నారు. టీ-హబ్ ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వైఫల్యాలను కూడా పాజిటీవ్‌గా స్వీకరించాలని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com