పాట్న: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్పై భారత వయుసేన చేసిన సర్జికల్ దాడులపై అభ్యంతరాలు తెలపడం పట్ల విస్మయానికి గురైన కాంగ్రెస్ నేత పార్టీ వీడారు. భారత మిలిటరీని అవమానించే విధంగా పార్టీ వ్యవహరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వినోద్ శర్మ శనివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నాకున్న ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు నేను రాజీనామా చేస్తున్నాను. సర్జికల్ దాడులపై వాయుసేను ఆధారాలు అడగడం పట్ల నేను విస్మయానికి గురయ్యాను. టెర్రరిస్ట్లపై దాడులను అనుమానించడమేంటి? పార్టీకి ఇలాంటి విధానం ఉండడం పట్ల నేను నిరాసక్తతతో ఉన్నాను. వాయు దాడుల్ని మనం రాజకీయం చేయకూడదు. మనం ఇలాంటి సమయంలో రక్షణాదళాలకు అండగా నిలబడాలి అని అన్నారు.