ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేడే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 01:35 PM

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఈసీ ముహూర్తం ఖరారు చేసేసింది. ఈ సాయంత్రమే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేయడానికి రంగం సిద్ధమైపోయింది. ఈ సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్ సభ గడువు జూన్ 3తో ముగియనున్న సంగతి విదితమే. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com