సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఈసీ ముహూర్తం ఖరారు చేసేసింది. ఈ సాయంత్రమే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేయడానికి రంగం సిద్ధమైపోయింది. ఈ సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్ సభ గడువు జూన్ 3తో ముగియనున్న సంగతి విదితమే. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.