ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ కలల సాకారంలో సీఐఎస్‌ఎఫ్ ముఖ్య పాత్ర: మోదీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 02:48 PM

ఘజియాబాద్: స్వతంత్ర భారతదేశ కలల సాకారంలో సీఐఎస్‌ఎఫ్ ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సెంట్రల్ ఇండ్రస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) 50వ ఆవిర్భావ దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఘజియాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్ క్యాంపులో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. సీఐఎస్‌ఎఫ్ విజయాలు ఎంతో ప్రధానమన్నారు. మన పొరుగుదేశం శత్రువుగా, యుద్ధంలో పోరాడే శక్తి లేనప్పుడు అంతర్గతంగా ఎన్నో కుట్రలకు పాల్పడతదన్నారు. ఉగ్రవాదం బహుముఖ రూపాల్లో విస్తరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని కాపాడటం సవాళ్లతో కూడుకున్న అంశం అన్నారు. వ్యక్తులను కాపాడటం సులువే కానీ సంస్థలను కాపాడటం కష్టమని ప్రధాని పేర్కొన్నారు. కష్టకాలంలో అంతర్గతంగా, విదేశాల్లో సీఐఎస్‌ఎఫ్ అందించిన సేవలను ప్రధాని సందర్భంగా కొనియాడారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com